చీటింగ్: క్యాటిల్ మార్కెట్లో బీ అలర్ట్
- September 12, 2016
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్ (ఎంఇసి), వినియోగదారుల్ని అప్రమత్తంగా ఉండాలని కోరుతోంది. ఈద్ అల్ అదా సందర్భంగా జంతువుల్ని బలివ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా పెద్దయెత్తున జంతువుల్ని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు క్యాటిల్ మార్కెట్కి చేరుకుంటారు. రద్దీని క్యాష్ చేసుకునేందుకు పూర్తి ఆరోగ్యంతో లేని జంతువల్ని అమ్మకందారులు వినియోగదారులకు విక్రయిస్తుంటారనే హెచ్చరికలు ఎంఇసి నుంచి వచ్చాయి. కొన్ని జంతువులను శుభ్రంగా కడిగి, వాటికి ఉన్న అనారోగ్యం గురించి తెలియకుండా చేస్తుంటారనీ, అలాగే అనారోగ్యంతో నీరసపడిపోయిన జంతువుల్ని క్రూరంగా హింసించి, అవి పడిపోకుండా చేస్తుంటారనీ, ఇంకొన్ని సందర్భాల్లో కేవలం తలను మాత్రం చూపించి, ఆ తర్వాత వేరేవాటిని అంటగడ్తుంటారనీ ఇలా రకరకాలైన మోసాలు జరుగుతుంటాయి కాబట్టి వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని ఎంఇసి ఓ ప్రకటనలో పేర్కొంది. ఎంఇసి హెచ్చరికల్ని వినియోగదారులు స్వాగతిస్తున్నారు. ఎప్పుడూ తాను జంతువుల్ని కొనే దుకాణంలోనే ఈసారి కొంటున్నాననీ, తెలియని దుకాణాల్లో కొనడంలేదని, ఓ షీప్ని ఈసారి 1,200 ఖతారీ రియాల్స్ వెచ్చించి కొనుగోలు చేశానని చెప్పారు ఓ వ్యక్తి. ఇంకో వ్యక్తి, మార్కెట్ అంతా తిరిగి పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఓ షీప్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







