చీటింగ్: క్యాటిల్ మార్కెట్లో బీ అలర్ట్
- September 12, 2016
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్ (ఎంఇసి), వినియోగదారుల్ని అప్రమత్తంగా ఉండాలని కోరుతోంది. ఈద్ అల్ అదా సందర్భంగా జంతువుల్ని బలివ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా పెద్దయెత్తున జంతువుల్ని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు క్యాటిల్ మార్కెట్కి చేరుకుంటారు. రద్దీని క్యాష్ చేసుకునేందుకు పూర్తి ఆరోగ్యంతో లేని జంతువల్ని అమ్మకందారులు వినియోగదారులకు విక్రయిస్తుంటారనే హెచ్చరికలు ఎంఇసి నుంచి వచ్చాయి. కొన్ని జంతువులను శుభ్రంగా కడిగి, వాటికి ఉన్న అనారోగ్యం గురించి తెలియకుండా చేస్తుంటారనీ, అలాగే అనారోగ్యంతో నీరసపడిపోయిన జంతువుల్ని క్రూరంగా హింసించి, అవి పడిపోకుండా చేస్తుంటారనీ, ఇంకొన్ని సందర్భాల్లో కేవలం తలను మాత్రం చూపించి, ఆ తర్వాత వేరేవాటిని అంటగడ్తుంటారనీ ఇలా రకరకాలైన మోసాలు జరుగుతుంటాయి కాబట్టి వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని ఎంఇసి ఓ ప్రకటనలో పేర్కొంది. ఎంఇసి హెచ్చరికల్ని వినియోగదారులు స్వాగతిస్తున్నారు. ఎప్పుడూ తాను జంతువుల్ని కొనే దుకాణంలోనే ఈసారి కొంటున్నాననీ, తెలియని దుకాణాల్లో కొనడంలేదని, ఓ షీప్ని ఈసారి 1,200 ఖతారీ రియాల్స్ వెచ్చించి కొనుగోలు చేశానని చెప్పారు ఓ వ్యక్తి. ఇంకో వ్యక్తి, మార్కెట్ అంతా తిరిగి పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఓ షీప్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- గురుదేవ సోషల్ సొసైటీ 93వ శివగిరి తీర్థయాత్ర..!!
- యూఏఈలో డస్టీ వెదర్..NCM సేఫ్టీ మెజర్స్ జారీ..!!
- కువైట్ లో కోల్డ్ వేవ్స్..మంచు కురిసే అవకాశం..!!
- రియాద్ పరిసర ప్రాంతాలలో 25 కొత్త పార్కులు ప్రారంభం..!!
- జబల్ అఖ్దర్లో OMR9 మిలియన్లతో టూరిజం ప్రాజెక్టులు..!!
- ఇండోర్ ఫైర్, చార్కోల్ వినియోగం పై హెచ్చరికలు..!!
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!







