ఈద్‌ అల్‌ అదా ప్రార్థనల్లో యూఏఈ పాలకులు

- September 12, 2016 , by Maagulf
ఈద్‌ అల్‌ అదా ప్రార్థనల్లో యూఏఈ పాలకులు

యూఏఈ పాలకులు ఈద్‌ అల్‌ అదా ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైస్‌ ప్రెసిడెంట్‌, యూఏఈ ప్రైమ్‌ మినిస్టర్‌, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, ఈద్‌ అల్‌ అదా ప్రార్థనల్ని జబెల్‌లోని షేక్‌ రషీద్‌ మాస్క్‌లో నిర్వహించారు. దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌, దుబాయ్‌ డిప్యూటీ రూలర్‌ మరికొంతమంది ప్రముఖులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాస్క్‌ ఇమామ్‌ అల్‌ షేక్‌ ఒమర్‌ అల్‌ ఖతీబ్‌, ఈద్‌ సందర్భంగా ప్రవచనాలు చెప్పారు. ఈద్‌ అల్‌ అదా ప్రాముఖ్యతను వివరించారు. తమ త్యాగాల ద్వారా ముస్లింలు అల్లాకి దగ్గరయ్యేందుకు ఈద్‌ అల్‌ అదా అత్యంత పవిత్రమైన రోజు అని చెప్పారాయన. 
షార్జా రూలర్‌, సుప్రీం కౌన్సిల్‌ మెంబర్‌ డాక్టర్‌ షేక్‌ సుల్తాన్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ కాసిమి, అల్‌ బదియా ముస్సాలాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అజ్మన్‌ రూలర్‌ షేక్‌ హుమైద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ నౌమి, షేక్‌ రషిద్‌ బిన్‌ హుమైద్‌ అల్‌ నౌమి మాస్క్‌లో ఈద్‌ అల్‌ అదా ప్రార్థనలు నిర్వహించారు. ఫుజారియా రూలర్‌ షేక్‌ హమాద్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ షర్కి, షేక్‌ జాయెద్‌ మాస్క్‌లో ప్రత్యేక ప్రార్థనల్ని నిర్వహించారు. ఉమ్‌ అల్‌ కైవాన్‌ రూలర్‌ షేక్‌ సౌద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ ముల్లా ప్రత్యేక ప్రార్థనల్ని నిర్వహించారు. రస్‌ అల్‌ ఖైమా రూలర్‌ షేక్‌ సౌద్‌ బిన్‌ సక్ర్‌ అల్‌ కాసిమి రస్‌ అల్‌ ఖైమాలోని అల్‌ ఖుజామ్‌లోని గ్రాండ్‌ ఈద్‌ ముసాలాలో ప్రత్యేక ప్రార్థనల్ని నిర్వహించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com