వాట్సాప్ ప్రైవసీ ప్లాన్పై భిన్నాభిప్రాయాలు
- September 12, 2016దుబాయ్: స్మార్ట్ ఫోన్స్లో మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ కొత్త ప్లాన్పై వినియోగదారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫేస్ బుక్ ద్వారా మెంబర్ డేటాను షేర్ చేసే వీలుండేలా కొత్త ప్లాన్ని వాట్సాప్ తెరపైకి తెస్తోంది. ఈ విషయంపై 2,800 మందిని సర్వే చేస్తే, అందులో నాలుగోవంతు వ్యక్తులు వాట్సాప్ని విడిచిపెడతామని తెలిపారు. ప్రైవసీ కండిషన్స్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్ పైరసీని తాను గౌరవిస్తాననీ, ఒకవేళ తనకు సంబంధించిన సమాచారం లీకై, అది తన కెరీర్ మీద ప్రభావం చూపిస్తే దాన్ని తానెలా సమర్థిస్తానని అవినాష్ సెక్వేరా అనే ఇండియన్ ఎక్స్పాట్ చెప్పారు. ఒక్కసారి ఆన్లైన్లోకి ఎంటర్ అయితే ఏదీ సీక్రెట్గా ఉండదనీ, ప్రైవసీ విషయంలో 'సెక్యూరిటీని' ఆశించడమే తగదని పాకిస్తాన్కి చెందిన వలసదారుడొకరు అభిప్రాయపడ్డారు. ఆన్లైన్కి పోస్టింగ్స్కి సంబంధించి కఠినంగా చట్టాలు అమలయ్యే యూఏఈలో, ప్రైవసీని తగ్గించడమంటే అది సరికొత్త సమస్యలకు తావిస్తుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







