హాజిస్ కొరకు నునుపైన ట్రాఫిక్ ప్రవాహం కొనసాగించాలని మక్కా గవర్నర్ పిలుపు
- September 12, 2016
రియాడ్: ప్రస్తుత హజ్ సీజన్లో మినా నుంచి అరాఫత్ మీదుగా వచ్చే భక్తుల రాక ఒక అపూర్వమైన ఉద్యమం మాదిరిగా ఉందని మక్కా గవర్నర్ యువరాజు ఖలేద్ అల్-ఫైసల్ వర్ణించారు.యువరాజు ఖలేద్ " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ తమ రాజ్యంలో హజ్ మరియు ఉమ్రా యాత్రికులకు నాణ్యమైన సేవలు అందించడం తమ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ చర్యలు తమ శత్రువులకు ఇది అసూయని కల్గిస్తుందని ఆయన అన్నారు. హజ్ సీజన్లో మక్కా మరియు పవిత్ర స్థలాల సందర్శన కోసం కోసం ఒక సమగ్ర ప్రణాళిక అమలుచేస్తున్నట్లు తెలిపారు. ఒక ప్రణాళికలో భాగంగా యాత్రికుల ముంజేయకు ఎలక్ట్రానిక్ రిస్ట్ బ్యాండ్లు ధరింపచేయడం ద్వారా మక్కా పవిత్ర నగరమని ఒక స్మార్ట్ నగరంగా మార్చబడిందని ఆయన అన్నారు.యాత్రికుల ప్రవాహాన్ని మరియు ట్రాఫిక్ అవరోధాలని నియంత్రించడానికి ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల ద్వారా నాయకత్వ నిర్దేశకాలను ఏర్పరచి మరియు ఒక స్మార్ట్ నగరంకు తగినట్లుగా ఒక యోగ్యమైన విధానం ఈ అమలులో ఉందని ఆయన తెలిపారు. హాజ్ యాత్రకు వచ్చిన వారికి సంపూర్ణ అవకాశం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు ఇస్లాం మతంలో అతి ప్రాముఖ్యమైన నియమం హజ్ సందర్శన అని భౌతికంగా మరియు ఆర్థికంగా ఉన్నవారు తమ జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే హాజ్ యాత్రకు వస్తారు కనుక వారి ఎటువంటి లోటు పాట్లు లేకుండా అని సౌకర్యాలు సమకూర్చాలని ఆయన ఆజ్ఞాపించారు.మక్కాని సందర్శించే అక్రమ యాత్రికులు సంఖ్య 5 శాతంకు పడిపోయిందిని తెలియచేస్తూ వరుసగా 1436 మరియు 1435 పుణ్యక్షేత్రం సీజన్లలో 70 శాతంతో పోల్చితే, 9 శాతంకు ప్రస్తుతం పడిపోయిందని తెలిపారు. పైన పేర్కొన్న నియమ నిబంధనలను ఉల్లంఘించినవారిపై విషయంలో కఠినంగా ఉండనున్నట్లు ఆయన ప్రకటించారు.
తాజా వార్తలు
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- 13 సంస్థలపై SR37 మిలియన్ల జరిమానా..!!
- రెండు దేశాలతో ఎయిర్ సర్వీసులకు సుల్తాన్ ఆమోదం..!!
- కువైట్ లో కొత్త రెసిడెన్సీ ఉల్లంఘన జరిమానాలు..!!
- ICRF ఫేబర్-కాస్టెల్ స్పెక్ట్రమ్ క్యాలెండర్ 2026 ఆవిష్కరణ..!!
- దుబాయ్ లో ఆ 4 బీచ్లు ఫ్యామిలీల కోసమే..!!
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..







