మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- December 30, 2025
హైదరాబాద్: కొత్తగా ఏర్పాటైన మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్కు తొలి కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి.అనంతరం నేరడ్మేట్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ శాఖ పనితీరు, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారిస్తామని తెలిపారు.
కమిషనరేట్ పరిధిలో నేరాలను నియంత్రించడం, ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడం, మహిళలు, పిల్లలు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.అలాగే ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, సమస్యలను వేగంగా పరిష్కరించేలా పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉండేలా అన్ని విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుని పని చేస్తామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- తెలంగాణ: ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు
- ఈద్ అల్ ఫితర్..యూఏఈలో వర్షం పడుతుందా?
- 32 ఉల్లంఘనలను జారీ చేసిన కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- అత్యవసర సంఘటన ప్రాంతాలకు దూరంగా ఉండండి..!!
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..









