ఘనంగా నిర్వహించిన ఎం.ఎస్ సుబ్బలక్ష్మి శత జయంతి ఉత్సవాలు

- September 15, 2016 , by Maagulf

ప్రముఖ సంగీత విద్వాంసురాలు భారతరత్న ఎం.ఎస్ సుబ్బలక్ష్మి అందించిన సంగీతం ప్రపంచానికే ఆదర్శమని తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. తితిదే, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలో నిర్వహించిన ఎం.ఎస్ సుబ్బలక్ష్మి శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. తిరుపతి పూర్ణకుంభం కూడలిలోని సుబ్బలక్ష్మి విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు, తమిళ, కన్నడ సహా పలు భాషల్లో భక్తిరస పాటలు అందించారని తెలిపారు. ఎమ్‌ఎస్‌ సుబ్బలక్ష్మి ఆలపించిన శ్రీవారి సుప్రభాతం భక్తుల మనస్సు నుంచి చెరిగిపోదని ఆయన అన్నారు. 

ఈ కార్యక్రమంలో తితిదే అధికారులు, సంగీత కళాశాల అధ్యాపకులు, విద్యార్ధులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com