భారతీయ గిరిజనుడికి అందిన బహ్రెయిన్‌ పీఎం సాయం

- September 16, 2016 , by Maagulf
భారతీయ గిరిజనుడికి అందిన బహ్రెయిన్‌ పీఎం సాయం
న్యూ ఢిల్లీ: దన మాజి అనే భారతీయ గిరిజనుడొకరు, తన భార్య మృతదేహాన్ని భుజాన మోస్తూ 10 కిలోమీటర్ల దూరాన ఉన్న తన గ్రామానికి ఆసుపత్రి నుంచి తరలించిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పేదరికంతో మగ్గుతున్న ఆ గిరిజనుడికి ప్రభుత్వాసుపత్రి కనీసం అంబులెన్స్‌ సౌకర్యం కూడా కల్పించలేకపోయింది. అయితే ఈ ఘటనకు చలించిపోయిన బహ్రెయిన్‌ ప్రధాని 5,000 బహ్రెయినీ దినార్స్‌ని బాధిత కుటుంబానికి ప్రకటించారు. ప్రధాని ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా ఈ మేరకు చెక్‌ని విడుదల చేయగా, ఇండియాలోని బహ్రెయిన్‌ ఎంబసీ అధికారులు ఆ చెక్‌ని దనకి అందజేశారు. బహ్రెయిన్‌ ప్రధాని అందించిన సాయంతో తన ముగ్గురు కుమార్తెలను చదివించుకుంటానని చెబుతూ, బహ్రెయిన్‌ ప్రధాని ఖలీఫాకి కృతజ్ఞతలు తెలిపారు. 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com