క్షిపణి విధ్వంసక యుద్ధనౌక 'మార్ముగావో'ను నావికా దళం ప్రారంభించింది...
- September 17, 2016
విశాఖపట్నం తరగతి క్షిపణి విధ్వంసక యుద్ధనౌక 'మార్ముగావో'ను నావికా దళం ప్రారంభించింది. దీన్ని స్వదేశీ పరిజ్ఞానంతో మజ్గావ్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) అభివృద్ధిచేసిన సంగతి తెలిసిందే. పోరాట సామర్థ్యం విషయంలో ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ యుద్ధనౌకలతో సరితూగుతుందని నౌకా దళ అధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా చెప్పారు. ముంబయిలో శనివారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో.. సునీల్ సతీమణి రీనా దీన్ని ప్రారంభించారు.
అనంతరం తొలిసారిగా అరేబియా సముద్రంలోకి దీన్ని పంపారు. సముద్ర పరీక్షలు పూర్తిచేసుకున్న అనంతరం ఇది లాంఛనంగా నౌకాదళంలో చేరుతుంది. 2020-24ల్లో ఇలాంటి మరో నాలుగు నౌకలను సైతం ఎండీఎల్ అభివృద్ధి చేస్తుంది. విశాఖపట్నం తరగతికి చెందిన వీటిలో మొదటి నౌకను గతేడాది ఏప్రిల్ 20న ప్రారంభించిన సంగతి తెలిసిందే.తాజా నౌకను 7,300 టన్నుల సామర్థ్యంతో గరిష్ఠంగా 30 నాట్ల వేగంలో దూసుకెళ్లేలా సిద్ధంచేశారు. ఉపరితలం-ఉపరితలం, ఉపరితలం- గగనతలం క్షిపణులతోపాటు జలాంతర్గామి విధ్వంసక రాకెట్లనూ దీనిపై నుంచి ప్రయోగించే వీలుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









