ఖతార్ లో కీ.శే.ఆచార్య కె.జయశంకర్ గారి 81వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు
- August 08, 2015
కీ. శే. ఆచార్య కొత్తపెళ్లి జయశంకర్ గారి 81వ జన్మదిన వేడుకలు ఖతార్ దేశములో "తెలంగాణా ప్రజా సమితి ఖతార్" కార్యవర్గ సభ్యుల అద్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి దాదాపు 150 మంది సభ్యులు హాజరయి తెలంగాణ సిద్ధాంత కర్త కీ. శే. ఆచార్య కొత్తపెళ్లి జయశంకర్ గారి జయంతి ని పురస్కరించుకొని తలచుకొని తెలంగాణా ప్రజా సమితి ఖతార్ సాంస్కృతిక కల బృందం సభ్యులు వారి పాటలతో మరొక్కసారి ఆచార్యుల వారిని గురుతు చేసారు. తెలంగాణా ప్రజా సమితి ఖత్తర్ కార్యవర్గ బృందం అందరు తెలంగాణ సిద్ధాంత కర్త కీ. శే. ఆచార్య కొత్తపెళ్లి జయశంకర్ గారిని ఆదర్శంగా తీసుకొని బంగారు తెలంగాణా కోసం అందరు కలిసి పనిచయ్యలని నిర్ణయించుకున్నారు. అలాగే ఖత్తర్ లో ఉన్న తెలంగాణా బిదలందరూ కలిసి ఖత్తర్ లో ఉన్న తెలంగాణా ప్రవాసీలకు ఎల్లప్పుడూ తెలంగాణా ప్రజా సమితి తరపున సహాయ సహకారాలు అందిస్తామని కార్యవర్గ బృందం తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా ప్రజా సమితి కార్యవర్గ సభ్యులు శ్రీ ధర్మరాజు , శంకర్ గౌడ్, మహిపాల్ , శ్రీధర్ అబ్బాగొని, కొమురయ్య, మురళి రాజారామ్, వేణుగోపాల్ పడకంటి మరియు సమితి సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







