తళుకు తారల అంబరం,నింగినంటే సంబరం:దుబాయ్ 'సైమా అవార్డుల' కార్యక్రమం
- August 08, 2015
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వారు ఈ సంవత్సరం దుబాయిలో నిర్వహించిన అవార్డుల ఉత్సవం ఆకాశంలో నక్షత్రాలనే చిన్నబోయేట్టు చేసింది. దీనిలో 2014 సంవత్సరానికిగాను గురువారం తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన వారికి అవార్డులు అందించారు.శుక్రవారం తమిళ,మలయాళం సినీ పరిశ్రమలకు చెందిన ఆర్టిస్టులకు ఆయా రంగాలలో అవార్డులు అందించారు. ప్రముఖ తెలుగు నిర్మాత రమానాయుడు జ్ఞాపకార్ధం అల్లు ఆరవింద్, భారతీరాజా, సుహాసిని చేతుల మీదుగా, ఆయన కుటుంబ సభ్యులు వెంకటేష్, రాణా, నగఛైతన్యలు జ్ఞాపికను స్వీకరించారు. ప్రముఖ పాప్ గాయని ఉష ఉత్తుప్ గానం, బాలకృష్ణ, వెంకటేష్, ఖుష్బూ, శ్రుతి హసన్ ల చిందులు వీక్షకులను హుషారెత్తించాయి. బాలకృష్ణ, రాశీ ఖన్నా, చంద్రబోస్, పీటర్ హెఇన్స్, శ్రియ, సుహాసిని, బ్రహ్మానందం, శ్రుతి హసన్ పురస్కారాలందుకున్న వారిలో ప్రముఖులు. భారతీయ సినీ అందాల రాణులు - ప్రణీత, పూజా హెగ్డే, అదా శర్మ, శ్రియ, అమల పాల్ తమ నృత్యాలతో రంగస్థలాన్ని జిగెల్మనిపించారు.
--సి.శ్రీ(దుబాయ్)


తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







