పాకిస్తాన్ ఒక ఉగ్రదేశం - బ్రహమదగ్ బుగ్తీ
- September 20, 2016
పాకిస్తాన్ను 'ఉగ్రదేశం'గా చివరకు అదే దేశంలోని బలూచిస్తాన్ ముద్ర వేసేసింది. తమ రాష్ట్రంలో దాదాపు 15 వేలకు పైగా కార్యకర్తలను అరెస్టు చేసినట్టు సైన్యం చెబుతోందని, కనీసం ఒక్క కేసు కూడా కోర్టుకు వెళ్లలేదని ఐక్యరాజ్యసమతి మానవ హక్కుల కమిషన్ లో బలూచిస్తాన్లోని రిపబ్లికన్ పార్టీ నేత బ్రహమదగ్ బుగ్తీ ఫిర్యాదు చేశారు. మానవ హక్కులను ఒకపక్క పాకిస్తాన్ తన దేశంలోనే దారుణంగా హరిస్తూ, మరోపక్క భారత్ పైకి ఉగ్ర మూకలను ఎగదోలుతోందని ఆయన విమర్శించారు. బలూచిస్తాన్ కు భారత్ ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ప్రకటించినందుకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ, మిగిలిన ప్రజాస్వామ్య దేశాలు కూడా బలూచిస్తాన్ కు మద్దతు తెలిపేందుకు ముందుకు రావాలని బుగ్తీ కోరారు. పాకిస్తాన్ లో బలూచిస్తాన్ ఎటువంటి పరిస్థితుల్లోనూ కలిసి ఉండలేదని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









