త్వరలో 'అమ్మ టూ వీలర్ సర్వీస్ ట్రైనింగ్ సెంటర్ల'
- September 20, 2016
తమిళనాడు ముఖ్యమంత్రి జె జయలలిత మరో అడుగు ముందుకేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో భాగంగా 'అమ్మ టూ వీలర్ సర్వీస్ ట్రైనింగ్ సెంటర్ల' ను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మే నెల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల మానిఫెస్టోలో తాను ప్రకటించిన విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఏఐడీఎంకే సుప్రీమో జయలలిత తెలిపారు.
రాష్ట్రంలోని మొత్తం 35 కేంద్రాల్లో సెంటర్లను స్థాపించేందుకు సిద్ధం చేస్తున్నామని, ఒక్కో సెంటర్లో 30 మంది వరకూ అభ్యర్థులకు మూడు నెలల శిక్షణతో పాటు 3000 రూపాయల స్టై ఫండ్ చెల్లించనున్నట్లు ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 1.65 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. అలాగే 'సీమెన్స్', 'డిజైన్ టెక్' లతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద.. రూ. 546,84 కోట్ల అంచనా వ్యయంతో ఓ ఎక్సలెన్స్ సెంటర్ తో పాటు, ఐదు నైపుణ్యాభివృద్ధి ఇనిస్టిట్యూట్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చెప్పారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









