మహిళా ఉద్యోగుల భద్రతలో తెలంగాణ రాష్ట్రానికి రెండో ర్యాంకు
- September 21, 2016
మహిళా ఉద్యోగుల భద్రతలో తెలంగాణ రాష్ట్రానికి రెండో ర్యాంకు లభించింది. అలాగే ఉద్యోగాలు చేసే మహిళలకు ఢిల్లీ నగరం పరమ వేస్ట్ అని, ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం బెస్ట్ అని తేలింది. అలాగే రెండోస్థానంలో తెలంగాణ నిలవగా, ఆంధ్రప్రదేశ్కు ఆరోస్థానం లభించింది. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సీఎస్ఐఎస్), నాథన్ అసోసియేట్స్ సంస్థలు సంయుక్తంగా చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రధానంగా నాలుగు అంశాల ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు పలు ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఆయా సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినిల భద్రతకు తగు ఏర్పాట్లు చేసింది. షీ టీమ్స్ ఏర్పాటుచేయడమేగాక మహిళల కోసం ప్రత్యేకంగా బస్సులను కూడా ఏర్పాటుచేసింది. తెలంగాణలో ఏర్పాటుచేసిన షీ టీంల వ్యవస్థపై ఆయా రాష్ట్రాలు కూడా ఆస్తక్తి చూపి అధ్యయనం కోసం హైదరాబాద్కు కూడా వచ్చాయి.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









