5 పైసల నష్టంతో ముగిసిన రూపాయి...

- September 21, 2016 , by Maagulf
5 పైసల నష్టంతో ముగిసిన రూపాయి...

బ్యాంక్ ఆఫ్ జపాన్ ఊహించని నిర్ణయంతో దేశీయ కరెన్సీ రూపాయి విలవిల్లాడుతోంది. జపాన్ కేంద్ర బ్యాంక్ ద్రవ్యపరతి సమీక్ష లో తీసుకున్న నిర్ణయంతో దాదాపు 13 పైసల నష్టంతో భారీగా పతనమైంది. మంగళవారం 5 పైసల నష్టంతో ముగిసిన రూపాయి బుధవారం కుదేలైంది. నేడు ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ లో డాలర్ తో పోలిస్తే రూపాయి 67. 14 దగ్గర ట్రేడవుతోంది. బ్యాంకులు, ఎగుమతిదారుల అమ్మకాల వత్తిడితో ఈ పరిణామం సంభవించింది. మరోవైపు డాలర్ విలువ భారీగా పుంజుకుంది. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలతో ఇన్వెస్టర్లు డాలర్ కొనుగోళ్లపై మొగ్గు చూపారు. కాగా జపాన్ కేంద్ర బ్యాంకు -0.1శాతం యథాతథ నెగిటివ్ వడ్డీ రేట్ల కొనసాగింపు, భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com