మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేసిన బంగ్లాదేశ్ వ్యక్తికి జీవిత ఖైదు
- September 21, 2016
మనామా : ఒక బంగ్లాదేశీ వ్యక్తి మోటార్ బైక్ విడి భాగాలలో మారిజోనా మాదక ద్రవ్య మాత్రలు దాచి రాజ్యంలోనికి అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆరోపణ కేసులో యావజ్జీవ శిక్షతో పాటు 5,000 బి డి జరిమానా దేశ బహిష్కరణ విధించబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోటారుబైకుల విడి భాగాలలో మాదక ద్రవ్యాల ప్యాకేజీలను ఉంచి దేశం వెలుపలకు వచ్చి విక్రయిస్తుంటాడని తెలుసుకొన్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 30,000 బి డి విలువ కలిగిన మూడు కిలోగ్రాముల బరువు గల గంజాయి 505 మాత్రల ప్యాకేజీని నిందితుని నుండి పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ముద్దాయి దేశంలో మాదక ద్రవ్యాలను అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లు న్యాయవాదులు కోర్టుకి తెలిపారు. ఈ నేరానికి ముద్దాయికి 25 సంవత్సరాల జైలుశిక్షతో పాటు శిక్ష పూర్తి చేసిన తర్వాత బహరేన్ నుండి దేశమునుండి పంపించేస్తారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







