మానవ రవాణా కేసులో ఇద్దరు నిర్వాసిత మహిళలకు పదేళ్ల జైలు
- September 21, 2016
మనామా: మానవ రవాణా కేసులో ఇద్దరు నిర్వాసిత మహిళలకు ఒక్కొక్కరికి 10 సంవత్సరాల ఖైదును విధించారు.అంతేకాక ప్రతివాదులకు 2000 బి డి జరిమానా సైతం చెల్లించేలా తీర్పు ఇచ్చింది. వారు జైలు శిక్ష పూర్తి చేసిన తర్వాత దేశమునుండి పంపించేస్తారు.
రాజ్యంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురి మహిళలను నమ్మించి తర్వాత వ్యభిచారంలోనికి బలవంతంగా దింపి మహిళలను శారీరక దోపిడీకి గురిచేశారని వారిపై అభియోగం మోపబడింది. కోర్టు పత్రాలు తెలిపిన ప్రకారం ఆ బాధిత మహిళలను వివిధ అపార్ట్ మెంట్లలో తాళం వేసి ఉన్న గదులలో నిర్బంధించి నిత్యం అపరిచితులతో సెక్స్ కార్యకలాపాలు చేయించారు. అంతేకాక వారిని బలవంతంగా వివిధ భవనాలలో దాచి, ఆ మహిళా ముద్దాయిలు తాము తీసుకువచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేయించి ఆ వచ్చిన డబ్బు ద్వారా జీవనం కొనసాగిస్తున్నారు. కాగా వీరి చేతిలో బందీలుగా ఉన్న స్రీలు కనీసం తమ తమ ప్రాథమిక నిత్యావసరాలు సైతం లేకుండా దుర్భర జీవితం గడుపుతున్నారు.న్యాయవాదులు విచారణ సాక్షులు మరియు పరిశోధనాత్మక నివేదికలు, పలువురు ఇచ్చిన సాక్ష్యాల ఆధారంగా వారికి వ్యతిరేకంగా ఆరోపణలు సేకరించిన తరువాత తమ తీర్పుని వెలువరించారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







