మానవ రవాణా కేసులో ఇద్దరు నిర్వాసిత మహిళలకు పదేళ్ల జైలు

- September 21, 2016 , by Maagulf
మానవ రవాణా కేసులో ఇద్దరు నిర్వాసిత  మహిళలకు పదేళ్ల జైలు

 మనామా: మానవ రవాణా కేసులో ఇద్దరు నిర్వాసిత  మహిళలకు ఒక్కొక్కరికి 10 సంవత్సరాల ఖైదును  విధించారు.అంతేకాక ప్రతివాదులకు 2000 బి డి  జరిమానా సైతం చెల్లించేలా తీర్పు ఇచ్చింది. వారు జైలు శిక్ష పూర్తి చేసిన తర్వాత దేశమునుండి పంపించేస్తారు.

రాజ్యంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురి మహిళలను నమ్మించి తర్వాత వ్యభిచారంలోనికి  బలవంతంగా దింపి  మహిళలను శారీరక దోపిడీకి గురిచేశారని వారిపై అభియోగం మోపబడింది. కోర్టు పత్రాలు తెలిపిన  ప్రకారం ఆ బాధిత మహిళలను వివిధ అపార్ట్ మెంట్లలో తాళం వేసి ఉన్న గదులలో నిర్బంధించి నిత్యం   అపరిచితులతో సెక్స్  కార్యకలాపాలు చేయించారు. అంతేకాక వారిని బలవంతంగా వివిధ భవనాలలో దాచి, ఆ  మహిళా ముద్దాయిలు తాము తీసుకువచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేయించి ఆ వచ్చిన డబ్బు ద్వారా జీవనం కొనసాగిస్తున్నారు. కాగా వీరి చేతిలో బందీలుగా ఉన్న స్రీలు కనీసం తమ తమ ప్రాథమిక నిత్యావసరాలు సైతం లేకుండా దుర్భర జీవితం గడుపుతున్నారు.న్యాయవాదులు విచారణ సాక్షులు మరియు పరిశోధనాత్మక నివేదికలు, పలువురు ఇచ్చిన సాక్ష్యాల ఆధారంగా వారికి  వ్యతిరేకంగా ఆరోపణలు సేకరించిన తరువాత తమ తీర్పుని వెలువరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com