మానవ రవాణా కేసులో ఇద్దరు నిర్వాసిత మహిళలకు పదేళ్ల జైలు
- September 21, 2016
మనామా: మానవ రవాణా కేసులో ఇద్దరు నిర్వాసిత మహిళలకు ఒక్కొక్కరికి 10 సంవత్సరాల ఖైదును విధించారు.అంతేకాక ప్రతివాదులకు 2000 బి డి జరిమానా సైతం చెల్లించేలా తీర్పు ఇచ్చింది. వారు జైలు శిక్ష పూర్తి చేసిన తర్వాత దేశమునుండి పంపించేస్తారు.
రాజ్యంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురి మహిళలను నమ్మించి తర్వాత వ్యభిచారంలోనికి బలవంతంగా దింపి మహిళలను శారీరక దోపిడీకి గురిచేశారని వారిపై అభియోగం మోపబడింది. కోర్టు పత్రాలు తెలిపిన ప్రకారం ఆ బాధిత మహిళలను వివిధ అపార్ట్ మెంట్లలో తాళం వేసి ఉన్న గదులలో నిర్బంధించి నిత్యం అపరిచితులతో సెక్స్ కార్యకలాపాలు చేయించారు. అంతేకాక వారిని బలవంతంగా వివిధ భవనాలలో దాచి, ఆ మహిళా ముద్దాయిలు తాము తీసుకువచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేయించి ఆ వచ్చిన డబ్బు ద్వారా జీవనం కొనసాగిస్తున్నారు. కాగా వీరి చేతిలో బందీలుగా ఉన్న స్రీలు కనీసం తమ తమ ప్రాథమిక నిత్యావసరాలు సైతం లేకుండా దుర్భర జీవితం గడుపుతున్నారు.న్యాయవాదులు విచారణ సాక్షులు మరియు పరిశోధనాత్మక నివేదికలు, పలువురు ఇచ్చిన సాక్ష్యాల ఆధారంగా వారికి వ్యతిరేకంగా ఆరోపణలు సేకరించిన తరువాత తమ తీర్పుని వెలువరించారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









