ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటా: ఎస్.జానకి
- September 22, 2016
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ.. ఇలా వివిధ భాషల్లో దాదాపు 48,000 పాటలను ఆలపించిన మధుర గాయని ఎస్. జానకి ఇక రిటైరవుతున్నట్లు ప్రకటించారు. 59 సంవత్సరాల తన సుదీర్ఘ కెరీర్కు మలయాళ పాటతో ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. '10 కల్పనకల్' అనే మలయాళ చిత్రం కోసం తాను పాడే జోలపాటే చివరిదని పేర్కొన్నారు. 'ఇక పాటలు చాలనుకుంటున్నా. చాలా భాషల్లో పాడాను. పెద్దదాన్నయిపోయాను.. ఇక ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నా. మలయాళ పాటతో మానేయాలని ప్రత్యేకంగా అనుకోలేదు.. అనుకోకుండా జరిగింది అంతే.. అది లాలి పాట.. నా మనసుకు చాలా నచ్చింది' అని జానకి ఓ ఆంగ్లపత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.వేడుకల్లో సైతం ఇక పాడబోనని ఆమె చెప్పారు.
గుంటూరులో జన్మించిన జానకి 1957లో తమిళ సినిమాతో గాయనిగా కెరీర్ను ప్రారంభించారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఇళయరాజా, జానకి కలయికలో వచ్చిన పాటలు శ్రోతలను చాలా ఆకట్టుకున్నాయి. ఉత్తమ గాయనిగా జానకికి 4 జాతీయ పురస్కారాలు, వివిధ రాష్ట్రాల నుంచి లెక్కలేనన్ని అవార్డులు లభించాయి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







