జంట నగరాల్లో విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవు
- September 22, 2016
హైదరాబాద్ జంట నగరాల్లో విద్యా సంస్థలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులపాటు సెలవులు ప్రకటించింది. నగరంలో కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యా సంస్థలకు సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించింది. .
ఈ భారీ వర్షాలకు హైదరాబాద్లోని పలు కాలనీలు వరదనీటిలోనే చిక్కుకున్నాయి.
రహదారులన్నీ నీటితో నిండడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని మూడు పార్కులను హెచ్ఎండీఏ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సంజీవయ్య, ఇందిరా, లుంబినీ పార్కుల్లోకి శనివారం వరకు సందర్శకులను అనుమతించేది లేదని హెచ్ఎండీఏ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









