ఇద్దరు పీఓకే అనుమానితులను పట్టుకున్న బిఎస్ఎఫ్ దళాలు

- September 22, 2016 , by Maagulf
ఇద్దరు పీఓకే అనుమానితులను పట్టుకున్న బిఎస్ఎఫ్ దళాలు

జమ్ముకాశ్మీర్ యూరీ సెక్టార్‌లో ఇద్దరు అనుమానితులను ఇండియన్ ఆర్మీ, బిఎస్ఎఫ్ దళాలు పట్టుకున్నాయి. ఈ ఇద్దరూ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు చెందినవారు. వీరినుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ఇంటరాగేషన్ నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం యూరీ సెక్టార్‌లోని ఆర్మీ స్థావరంపై పాక్ ప్రేరిత ఉగ్రవాదుల దాడి అనంతరం భారత బలగాలు అప్రమత్తంగా ఉంటున్నాయి. నవాజ్ హిజ్బుల్ కమాండర్‌లా మాట్లాడుతున్నారు. యూరీ సెక్టార్‌లో తాజాగా పట్టుబడినవారు ఉగ్రవాద దాడికి వచ్చారా లేక వారి ఏజెంట్లా అనేది తేలనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com