పతకాల పట్టికలో భారత్‌కు రెండో స్థానం

- September 23, 2016 , by Maagulf
పతకాల పట్టికలో భారత్‌కు రెండో స్థానం

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ షూటింగ్‌ ప్రపంచ కప్‌లో చివరి రోజు భారత షూటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. మెన్స్‌ ట్రాప్‌లో లక్ష్మయ్య, కిస్మత్‌, మానవాదిత్య కాంస్య పతకం గెలిచారు. ఈ విభాగంలో ఇటలీ స్వర్ణం గెలవగా, ఆస్ట్రేలియా రజతం సాధించింది.
మొత్తం 24 పతకాలతో(స్వర్ణం-9, రజతం-5, కాంస్యం-10) భారత్‌ పతకాల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. 25 పతకాలతో రష్యా అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 18 దేశాలు ఈ పోటీలో పతకాలు గెలిచాయి.ప్రముఖ షూటర్లు జీతూరాయ్‌, సంజీవ్‌ రాజ్‌పుత్‌, మైరాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ అక్టోబరులో జరగనున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ సీనియర్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌లో పాల్గొననున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com