మాస్కోలో ఘోర ప్రమాదం..
- September 23, 2016
రష్యా రాజధాని మాస్కో నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మాస్కో తూర్పు ప్రాంతంలోని ఓ గిడ్డంగిలో అగ్నిప్రమాదం సంభవించడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేయడానికి వెళ్లారు. విధినిర్వహణలో ఉన్న ఆ సిబ్బందిలో 8 మంది మంటల్లో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఈ విషాదం చోటుచేసుకున్నట్లు చెప్పారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.ప్లాస్టిక్ వస్తువులు ఉన్న గిడ్డంగిలో గురువారం సాయంత్రం నుంచే పెద్ద ఎత్తున మంటలు ప్రారంభంకాగా..అగ్నిమాపక సిబ్బంది అదుపుచేసే ప్రయత్నంలో ప్రమాదం జరిగినట్లు మాస్కో అత్యవసర విభాగం మంత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. గిడ్డంగి నుంచి రాత్రి వంద మంది కార్మికులను సురక్షితంగా ఖాళీ చేయించారు. భవనం కూలడంతో.. మంటలు ఆర్పడానికి భవనంపైకి ఎక్కిన అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయి. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







