పద్మ అవార్డులకు నలుగురి పేర్లు సిఫారసు

- September 23, 2016 , by Maagulf
పద్మ అవార్డులకు నలుగురి పేర్లు సిఫారసు

పారాలింపిక్స్‌లో పతకాలు గెలిచిన వారిని దేశంలో ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులకు సిఫారసు చేయనున్నట్లు కేంద్ర క్రీడలశాఖ మంత్రి విజయ్‌ గోయల్‌ తెలిపారు. ఈ నెల 7 నుంచి 18వరకు జరిగిన పారాలింపిక్స్‌లో దేశం తరఫున పాల్గొని పతకాలు సాధించిన నలుగురు అథ్లెట్ల పేర్లను సిఫారసు చేయనున్నట్లు గోయల్‌ ట్వీట్‌ చేశారు.

పురుషుల హై జంప్‌లో స్వర్ణం సాధించిన మరియప్పన్‌ తంగవేలు, పురుషుల జావెలిన్‌ త్రోలో స్వర్ణం సాధించిన దేవేంద్ర ఝఝారియా, మహిళల షాట్‌పుట్‌ విభాగంలో రజతం సాధించిన దీప మాలిక్‌, పురుషుల హై జంప్‌లో కాంస్యం సాధించిన వరుణ్‌ భాటి పేర్లను హోం శాఖకు సిఫారసు చేయనున్నట్లు గోయల్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com