రజనీను కలిసిన ఎమ్.ఎస్. ధోనీ
- September 23, 2016
భారత క్రికెటర్ ఎమ్.ఎస్. ధోనీ సూపర్స్టార్ రజనీకాంత్ను శుక్రవారం సాయంత్రం కలిశారు. చెన్నైలో నిర్వహించిన 'ఎమ్.ఎస్. ధోనీ: ది అన్టోల్డ్ స్టోరీ' చిత్ర ప్రచార కార్యక్రమానికి ధోనీ హాజరయ్యారు. అనంతరం హీరో సుషాంత్సింగ్ రాజ్పుత్ తదితరులతో రజనీకాంత్ను కలిసి ఆయనతో కొంతసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ధోనీ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 'రజనీకాంత్ సార్తో' అని పోస్ట్ చేశారు. ఇటీవల 'కబాలి'లో రజనీలా కుర్చీపై స్టైల్గా కూర్చుని ఆయన అభిమానినని చెప్పకనే చెప్పిన ధోనీ.. ఇవాళ తలైవాను కలవడంతో ఎంత ఆనందపడుతుంటారో చెప్పకర్లేదు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







