రజనీను కలిసిన ఎమ్‌.ఎస్‌. ధోనీ

- September 23, 2016 , by Maagulf
రజనీను కలిసిన ఎమ్‌.ఎస్‌. ధోనీ

భారత క్రికెటర్‌ ఎమ్‌.ఎస్‌. ధోనీ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను శుక్రవారం సాయంత్రం కలిశారు. చెన్నైలో నిర్వహించిన 'ఎమ్‌.ఎస్‌. ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ' చిత్ర ప్రచార కార్యక్రమానికి ధోనీ హాజరయ్యారు. అనంతరం హీరో సుషాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ తదితరులతో రజనీకాంత్‌ను కలిసి ఆయనతో కొంతసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ధోనీ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 'రజనీకాంత్‌ సార్‌తో' అని పోస్ట్‌ చేశారు. ఇటీవల 'కబాలి'లో రజనీలా కుర్చీపై స్టైల్‌గా కూర్చుని ఆయన అభిమానినని చెప్పకనే చెప్పిన ధోనీ.. ఇవాళ తలైవాను కలవడంతో ఎంత ఆనందపడుతుంటారో చెప్పకర్లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com