సుష్మాస్వరాజ్ న్యూయార్క్ చేరుకున్నారు..
- September 25, 2016
కేంద్ర విదేశాంగశాఖా మంత్రి సుష్మాస్వరాజ్ ఇవాళ ఉదయం న్యూయార్క్ చేరుకున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 71 సమావేశాల్లో ప్రసంగించేందుకు ఆమె ఇక్కడికి చేరుకున్నారు. రేపు మధ్యాహ్నం ఆమె ప్రసంగించనున్నారు. భారత అంతర్గత అంశమైన కశ్మీర్పై పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు ఆమె ఈ సమావేశాల్లో గట్టి సమాధానం ఇవ్వనున్నారని భావిస్తున్నారు. ఉగ్రవాదంతోపాటు, భద్రతా సమితి విస్తరణ, వాతావరణ మార్పులు, ప్రపంచ శాంతి వంటి అంశాలపై కూడా సుష్మాస్వరాజ్ దృష్టి పెట్టనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగశాఖ ప్రతినిధి వికాస్స్వరూప్ తెలిపారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సుష్మాస్వరాజ్ ఏం మాట్లాడుతుందోనని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోందని ఆయన పేర్కొన్నారు.సుష్మాస్వరాజ్ ప్రసంగపాఠం వివరాలను ఆయన బయటపెట్టలేదు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







