ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల సంఖ్య 19కి చేరింది...
- September 25, 2016
ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఒడిశాకు చెందిన బీఎస్ఎఫ్ జవాను పితబస్ మాఝీ(30) శనివారం రాత్రి కన్నుమూశాడు. దీంతో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల సంఖ్య 19కి చేరింది. గత ఆదివారం జమ్ముకశ్మీర్లోని ఉరీ సెక్టార్ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 18 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వాళ్లలో మాఝీ ఒకరు. నౌపడ జిల్లాలోని దనజోల గ్రామానికి చెందిన మాఝీ 2008లో బీఎస్ఎఫ్లో చేరాడు. దసరా పండుగ సందర్భంగా ఇంటికి వద్దామని అనుకున్న జవాను విగతజీవిగా మారడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాఝీ ఈనెల 22న భార్యతో మాట్లాడాడు. త్వరలోనే కోలుకొని ఇంటికి వస్తానని ప్రమాణం చేసిన భర్త ఇకలేడనే వార్తను తెలుసుకున్న ఆమె కన్నీటి పర్యంతమవుతోంది. అంత్యక్రియల నిమిత్తం మాఝీ పార్థివదేహాన్ని స్వస్థలానికి తరలిస్తామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







