పీఎస్ఎల్వీ-సీ35 నాలుగో దశ రాకెట్ ప్రయోగం విజయవంతం..
- September 25, 2016
భూ ఉపరితలంపై వాతావరణం పరిశీలన, తుపాన్లను ముందుగానే పసిగట్టే పరిజ్ఞానంతో రూపొందిన స్కాట్శాట్ ఉపగ్రహం పీఎస్ఎల్వీ-సీ35 నాలుగో దశ రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. ఇస్రో నిర్ణయించిన సమయానికి అనుగుణంగానే రాకెట్ ప్రయోగం జరిగింది. స్కాట్శాట్-1ను పీఎస్ఎల్వీ-సీ35 విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగంలో 3 స్వదేశీ ఉపగ్రహాలు, 5 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి తీసుకెళ్లింది.వాటిని సంబంధిత కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ జరుగుతోంది. ముంబై ఐఐటీకి చెందిన ప్రథమ్ ఉపగ్రహం, బెంగళూరు పీఈఎస్ విశ్వవిద్యాలయానికి చెందిన పీశాట్ ఉపగ్రహం, అల్జీరియాకు చెందిన మూడు ఉపగ్రహాలు, కెనడా, యూఎస్కు చెందిన ఒక్కో ఉపగ్రహం ఈ రాకెట్ ద్వారా నింగిలో ప్రవేశ పెట్టనున్నారు. ప్రయోగం ప్రారంభించిన 2.15 గంటల్లో ఉపగ్రహాలను నిర్ధేశిత కక్ష్యలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









