'మేకిన్ ఇండియా' పిలుపు పొరుగుదేశాలకు ముప్పుగా మారిందా?

- September 27, 2016 , by Maagulf
'మేకిన్ ఇండియా' పిలుపు పొరుగుదేశాలకు ముప్పుగా మారిందా?

నరేంద్రమోదీ ఇచ్చిన 'మేకిన్ ఇండియా' పిలుపు పొరుగుదేశాలకు ముప్పుగా మారిందా? అవుననే అంటోంది గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక. ఇందులోభాగంగా పెట్టుబడులకు ద్వారాలు తెరిచిన భారత్‌కి బిజినెస్‌మేన్లు తరలిపోవడం చూస్తుంటే, అక్కడి ప్రభుత్వం ఆందోళన చెందుతోందని ఈ పత్రిక ఓ కథనాన్ని రాసుకొచ్చింది. చైనాకు చెందిన ఓ కంపెనీ ఇటీవల భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల తయారీ చేపట్టడాన్ని ఇందుకు ఉదాహరణగా ప్రస్తావించింది.
భారతలోవున్న మార్కెట్‌ అవకాశాలను దృష్టిలో పెట్టుకున్న చైనాకు చెందిన మిగతా స్మార్ట్‌ఫోన్ల కంపెనీలు ఇదేబాట పట్టేందుకు సిద్ధమైనట్టు తెలిపింది. ఇదే గనుక కంటిన్యూ అయితే ఈ సెక్టార్‌పై చైనాలో పనిచేస్తున్న లక్షలాది ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.ఆధునిక టెక్నాలజీ ద్వారా చైనా కంపెనీలు తమ పోటీ సామర్ధ్యాన్ని నిలబెట్టుకోవాలని, లేకపోతే భారత్ నుంచి చైనా కంపెనీలకు తిప్పలు తప్పవని గ్లోబల్‌ టైమ్స్‌ హెచ్చరించింది. భారతలో పెట్టుబడి పెట్టే ముందే.. ఆయా కంపెనీలు అక్కడి కంపెనీల చట్టం, కార్మిక చట్టాలు తెలుసుకుంటే మంచిదంటూ ఓ సలహా ఇచ్చేసింది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com