'మేకిన్ ఇండియా' పిలుపు పొరుగుదేశాలకు ముప్పుగా మారిందా?
- September 27, 2016
నరేంద్రమోదీ ఇచ్చిన 'మేకిన్ ఇండియా' పిలుపు పొరుగుదేశాలకు ముప్పుగా మారిందా? అవుననే అంటోంది గ్లోబల్ టైమ్స్ పత్రిక. ఇందులోభాగంగా పెట్టుబడులకు ద్వారాలు తెరిచిన భారత్కి బిజినెస్మేన్లు తరలిపోవడం చూస్తుంటే, అక్కడి ప్రభుత్వం ఆందోళన చెందుతోందని ఈ పత్రిక ఓ కథనాన్ని రాసుకొచ్చింది. చైనాకు చెందిన ఓ కంపెనీ ఇటీవల భారత్లో స్మార్ట్ఫోన్ల తయారీ చేపట్టడాన్ని ఇందుకు ఉదాహరణగా ప్రస్తావించింది.
భారతలోవున్న మార్కెట్ అవకాశాలను దృష్టిలో పెట్టుకున్న చైనాకు చెందిన మిగతా స్మార్ట్ఫోన్ల కంపెనీలు ఇదేబాట పట్టేందుకు సిద్ధమైనట్టు తెలిపింది. ఇదే గనుక కంటిన్యూ అయితే ఈ సెక్టార్పై చైనాలో పనిచేస్తున్న లక్షలాది ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.ఆధునిక టెక్నాలజీ ద్వారా చైనా కంపెనీలు తమ పోటీ సామర్ధ్యాన్ని నిలబెట్టుకోవాలని, లేకపోతే భారత్ నుంచి చైనా కంపెనీలకు తిప్పలు తప్పవని గ్లోబల్ టైమ్స్ హెచ్చరించింది. భారతలో పెట్టుబడి పెట్టే ముందే.. ఆయా కంపెనీలు అక్కడి కంపెనీల చట్టం, కార్మిక చట్టాలు తెలుసుకుంటే మంచిదంటూ ఓ సలహా ఇచ్చేసింది
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







