' ఎమ్ ఎస్ ధోని' ఏకంగా 60 దేశాల్లో 4500 స్క్రీన్స్ లో రిలీజ్ కానుంది...!
- September 27, 2016
బాలీవుడ్ ఇండస్ట్రీలో బయోపిక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల వరుసగా తెరకెక్కుతున్న క్రీడాకారుల బయోపిక్స్ కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అదే బాటలో భారత క్రికెట్ కెప్టెన్ ధోని జీవిత కథ ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎమ్ ఎస్ ధోని అన్ టోల్డ్ స్టోరి పేరుతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ అవుతోంది.
ఇప్పటికే ప్రమోషన్ పరంగా భారీ హైప్ క్రియేట్ చేస్తోన్న ధోని సినిమా, మరో అరుదైన ఘనతను సాధించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ లు, మెగాస్టార్ లు నటించిన సినిమాలు కూడా ఇప్పటి వరకు 50 దేశాలకు మించి రిలీజ్ కాలేదు. కానీ ఎమ్ ఎస్ ధోని మాత్రం ఏకంగా 60 దేశాల్లో 4500 స్క్రీన్స్ లో రిలీజ్ కానుంది.మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా పేరున్న ధోని బయోపిక్ కోసం అంతర్జాతీయ క్రీడాభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఓ సాధారణ టికెట్ కలెక్టర్ ఇండియన్ క్రికెట్ టీంకు కెప్టెన్ గా మారిన క్రమాన్ని సినిమాటిక్ గా రూపొందించిన ఈ సినిమాలో, ధోని పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కనిపిస్తున్నాడు. ఎ వెడ్నస్ డే, స్పెషల్ చబ్బీస్, బేబి లాంటి సినిమాలతో ఆకట్టుకున్న నీరజ్ పాండే ఎమ్ ఎస్ ధోని చిత్రానికి దర్శకత్వం వహించాడు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







