విదేశి టపాసులను నిరోధించిన ప్రభుత్వం
- September 29, 2016
ఏటా దీపావళి పండుగ సమయంలో ఇబ్బడిముబ్బడిగా వినియోగిస్తున్న విదేశీ బాణాసంచా దిగుమతిపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇకపై విదేశీ బాణాసంచా అమ్ముతున్నట్లు ఎవరైనా స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటారని కేంద్రవాణిజ్యపన్నుల శాఖ స్పష్టం చేసింది. ఎటువంటి అనుమతులు లేకుండా ఏటా భారత్కు విదేశీ బాణాసంచా దిగుమతి అవుతున్నట్లు డీఐపీపీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రమాదకర రసాయనం పొటాషియం క్లోరేట్తో తయారైన పేలుడు పదార్థాలు స్వేచ్ఛగా దిగుమతి అవుతున్నట్లు దేశీయ బాణాసంచా వ్యాపారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. సల్ఫర్, సల్ఫ్యూరేట్లను ఏదైనా క్లోరేట్ మిశ్రమంలో కలిపి తయారు చేసే విస్ఫోటనాల వినియోగంపై కూడా భారత్లో నిషేధం ఉంది. 2008 చట్టప్రకారం ఇప్పటి వరకూ బాణాసంచా దిగుమతులకు ఎలాంటి అనుమతులు లేవని, ఇకపై ఇవి తమ దృష్టికి తీసుకొస్తే చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని డీఐపీపీలోని ఓ ముఖ్యఅధికారి చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







