విదేశి టపాసులను నిరోధించిన ప్రభుత్వం

- September 29, 2016 , by Maagulf
విదేశి టపాసులను నిరోధించిన ప్రభుత్వం

ఏటా దీపావళి పండుగ సమయంలో ఇబ్బడిముబ్బడిగా వినియోగిస్తున్న విదేశీ బాణాసంచా దిగుమతిపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇకపై విదేశీ బాణాసంచా అమ్ముతున్నట్లు ఎవరైనా స్థానిక పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదుచేస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటారని కేంద్రవాణిజ్యపన్నుల శాఖ స్పష్టం చేసింది. ఎటువంటి అనుమతులు లేకుండా ఏటా భారత్‌కు విదేశీ బాణాసంచా దిగుమతి అవుతున్నట్లు డీఐపీపీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రమాదకర రసాయనం పొటాషియం క్లోరేట్‌తో తయారైన పేలుడు పదార్థాలు స్వేచ్ఛగా దిగుమతి అవుతున్నట్లు దేశీయ బాణాసంచా వ్యాపారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. సల్ఫర్‌, సల్ఫ్యూరేట్‌లను ఏదైనా క్లోరేట్‌ మిశ్రమంలో కలిపి తయారు చేసే విస్ఫోటనాల వినియోగంపై కూడా భారత్‌లో నిషేధం ఉంది. 2008 చట్టప్రకారం ఇప్పటి వరకూ బాణాసంచా దిగుమతులకు ఎలాంటి అనుమతులు లేవని, ఇకపై ఇవి తమ దృష్టికి తీసుకొస్తే చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని డీఐపీపీలోని ఓ ముఖ్యఅధికారి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com