పారాలింపిక్స్ విజేతలకు 90 లక్షలు బహుమతి ప్రకటించిన ప్రభుత్వం
- September 29, 2016
రియో పారాలింపిక్స్ విజేతలకు రూ. 90లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 2016లో రియో పారాలింపిక్స్లో భారత పారా-అథ్లెట్లు నాలుగు పతకాలు సాధించి చరిత్ర సృష్టించి దేశం గర్వ పడేలా చేశారని సామాజిక న్యాయ, సాధికారత మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ అన్నారు. దీంతో పతక విజేతలందరికీ కలిపి రూ.90లక్షల రివార్డును అందజేయాలని ఆ శాఖ నిర్ణయించినట్లు గెహ్లాట్ పేర్కొన్నారు.
బంగారు పతకాలు సాధించిన హైజంపర్ మరియప్పన్ తంగవేలు, జావెలిన్ త్రోవర్ దేవేంద్ర జజారియాలకు ఒక్కొక్కరికి రూ.30లక్షలు, షాట్పుట్లో రజతం సాధించిన దీపామలిక్కు 20లక్షలు, కాంస్యం సాధించిన వరుణ్ సింగ్ భాటికి 10లక్షలు రివార్డుగా అందించనున్నట్లు అధికారులుప్రకటనలో తెలిపారు. ఈ నగదును ఎవేర్నెస్ జనరేషన్ అండ్ పబ్లిసిటీ పథకం(ఏజీపీ) కింద గెహ్లాట్ అందజేస్తారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







