వచ్చే ఏడాది నుంచి భారత్ దేశంలో ఈ-పాస్ పోర్టులు

- September 29, 2016 , by Maagulf
వచ్చే ఏడాది నుంచి భారత్ దేశంలో ఈ-పాస్ పోర్టులు

దేశంలో వచ్చే ఏడాది మొదటి దశలో భాగంగా ఈ- పాస్ పోర్టులు జారీ చేయనున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వీకే సింగ్ వెల్లడించారు. అనంతరం రెండో దశ కింద మొబైల్ ఫోన్లలో సులభంగా తీసుకువెళ్లేలా పూర్తి డిజిటల్ పాస్ పోర్టులు జారీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. తిరువనంతపురంలోని ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. కొత్తగా జారీ చేయబోయే పాస్ పోర్టుల్లో చిప్స్ పొందుపరుస్తామన్నారు. పాస్ పోర్టుల జారీకి పోలీసు వెరిఫికేషన్ ప్రక్రియను వేగిరం చేసేందుకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమాచారాన్ని తెప్పిస్తామని ఆయన పేర్కొన్నారు.నర్సులు, ఇంటిపనిమనుషులుగా విదేశీ రిక్రూట్ మెంట్ విధానంలో ఆంక్షలు విధిస్తామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com