వచ్చే ఏడాది నుంచి భారత్ దేశంలో ఈ-పాస్ పోర్టులు
- September 29, 2016
దేశంలో వచ్చే ఏడాది మొదటి దశలో భాగంగా ఈ- పాస్ పోర్టులు జారీ చేయనున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వీకే సింగ్ వెల్లడించారు. అనంతరం రెండో దశ కింద మొబైల్ ఫోన్లలో సులభంగా తీసుకువెళ్లేలా పూర్తి డిజిటల్ పాస్ పోర్టులు జారీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. తిరువనంతపురంలోని ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. కొత్తగా జారీ చేయబోయే పాస్ పోర్టుల్లో చిప్స్ పొందుపరుస్తామన్నారు. పాస్ పోర్టుల జారీకి పోలీసు వెరిఫికేషన్ ప్రక్రియను వేగిరం చేసేందుకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమాచారాన్ని తెప్పిస్తామని ఆయన పేర్కొన్నారు.నర్సులు, ఇంటిపనిమనుషులుగా విదేశీ రిక్రూట్ మెంట్ విధానంలో ఆంక్షలు విధిస్తామన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







