2 స్కూల్‌ బస్సుల ఢీ: 46 మందికి గాయాలు

- September 29, 2016 , by Maagulf
2 స్కూల్‌ బస్సుల ఢీ: 46 మందికి గాయాలు

అబుదాబీ: పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డ హృదయ విదారకరమైన ఘటన అబుదాబీలో చోటుచేసుకుంది. రెండు స్కూల్‌ బస్సులు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 46 మంది విద్యార్థులకు ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. వీరిలో 25 మందికి స్వల్ప గాయాలయ్యాయి. 20 మందికి కొంచెం ఎక్కువగా గాయాలు అయ్యాయి. ఒక విద్యార్థి మాత్రం సీరియస్‌ కండిషన్‌లో ఉన్నారు. అబుదాబీ సిటీ శివార్లలోని అల్‌ ముసాఫా బ్రిడ్స్‌ సమీపంలో రెండు స్కూల్‌ బస్సులు, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాన్ని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడ్డవారిని అల్‌ మఫ్రాక్‌ హాస్పిటల్‌కి వైద్య చికిత్స కోసం తరలించారు. ప్రమాదం కారణంగా రోడ్డుని తాత్కాలికంగా మూసివేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com