చిన్నారులు కోలుకోవాలని ఆకాంక్షించిన షేక్ మొహమ్మద్
- September 29, 2016
అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ముసాఫాలో జరిగిన ప్రమాదం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామనే భరోసా ఇచ్చారు. అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ కోర్ట్ టీమ్, గాయపడ్డ విద్యార్థుల్ని అల్ ముఫ్రాక్ హాస్పిటల్లో పరామర్శించారు. స్కూల్ బస్సుల్లో ప్రయాణిస్తున్న విద్యార్థులతోపాటు, ఆ బస్సులు ఢీకొన్న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనంలోనూ కొందరు గాయాలపాలయ్యారు. ప్రమాదాన్ని డ్రైవర్ పసిగట్టినా, వాహనాన్ని అదుపు చేయడానికి తగినంత దూరం ముందున్న వాహనంతో మెయిన్టెయిన్ చేయకపోవడం ఈ ప్రమాదానికి కారణంగా గుర్తించారు. రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రతి ఒక్కరూ బాద్యతగా మెలగాలని ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణ విషయంలో మరింత సమర్థవంతంగా వ్యవహరించాలని సంబంధిత వర్గాలకు క్రౌన్ ప్రిన్స్ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







