చిన్నారులు కోలుకోవాలని ఆకాంక్షించిన షేక్ మొహమ్మద్
- September 29, 2016
అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ముసాఫాలో జరిగిన ప్రమాదం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామనే భరోసా ఇచ్చారు. అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ కోర్ట్ టీమ్, గాయపడ్డ విద్యార్థుల్ని అల్ ముఫ్రాక్ హాస్పిటల్లో పరామర్శించారు. స్కూల్ బస్సుల్లో ప్రయాణిస్తున్న విద్యార్థులతోపాటు, ఆ బస్సులు ఢీకొన్న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనంలోనూ కొందరు గాయాలపాలయ్యారు. ప్రమాదాన్ని డ్రైవర్ పసిగట్టినా, వాహనాన్ని అదుపు చేయడానికి తగినంత దూరం ముందున్న వాహనంతో మెయిన్టెయిన్ చేయకపోవడం ఈ ప్రమాదానికి కారణంగా గుర్తించారు. రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రతి ఒక్కరూ బాద్యతగా మెలగాలని ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణ విషయంలో మరింత సమర్థవంతంగా వ్యవహరించాలని సంబంధిత వర్గాలకు క్రౌన్ ప్రిన్స్ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







