గూగుల్ త్వరలో భారత్లో క్లౌడ్ సేవలు అందుబాటులోకి...
- September 30, 2016
ప్రముఖ సెర్చ్ఇంజన్ కంపెనీ గూగుల్ త్వరలో భారత్లో క్లౌడ్ సేవలు అందుబాటులోకి తేనుంది. భారతీయ డెవెలపర్స్, ఎంటర్ప్రైజ్ కస్టమర్లకు క్లౌడ్ సేవలను మెరుగుపరిచేందుకు 'గూగుల్ క్లౌడ్ రీజియన్'ను ప్రారంభించనున్నట్లు గూగుల్ వెల్లడించింది. వచ్చే ఏడాది ముంబయిలో గూగుల్ తమ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. గురువారం శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమంలో గూగుల్ క్లౌడ్ రీజియన్లపై ప్రకటన చేసింది. ముంబయి, సింగపూర్, సిడ్నీ, ఉత్తర వర్జీనియా, సావో పాలో, లండన్, ఫిన్ల్యాండ్, ఫ్రాంక్ఫర్ట్ ఎనిమిది ప్రాంతాల్లో కొత్తగా క్లౌడ్ రీజియన్లను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ వెల్లడించింది.భారత్లో ఇప్పటికే గూగుల్ విప్రో, అశోక్ లేలాండ్, మహీంద్రా అండ్ మహీంద్రా స్మార్ట్షిఫ్ట్, దైనిక్ భాస్కర్ గ్రూప్, ఇన్షార్ట్స్.కామ్ తదితర కంపెనీలు కస్టమర్లుగా ఉన్నాయి. వీటి అప్లికేషన్లను గూగుల్ ఇప్పటికే హోస్ట్ చేస్తోంది. అయితే భారత్లో కొత్త డేటా సెంటర్ల ద్వారా ఇక్కడి స్థానిక కస్టమర్లకు వేగంగా సేవలు అందించగలమని గూగుల్ పేర్కొంది. భారత్లో ప్రస్తుతం అమెజాన్కు మూడు, మైక్రోసాఫ్ట్కు మూడు డేటా సెంటర్లు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







