పాక్ లో ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్

- October 02, 2016 , by Maagulf
పాక్ లో ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్

గత నెలలో మర్దాన్ జిల్లా కోర్టులో జరిగిన పేలుడులో ప్రమేయమున్నట్టు భావిస్తున్న ఐదుగురు ఉగ్రవాదులను పాకిస్థాన్ అరెస్ట్ చేసింది. ఈ విషయాన్ని పాక్ ప్రధాని కార్యాలయం ఆదివారం ప్రకటించింది. సెప్టెంబరు 2న జిల్లా కోర్టులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 14 మంది మరణించారు. ఈ క్రమంలో ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించిన దళాలు తాాజాగా నాలుగు ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసి ఐదుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నాయి. మదాన్ దాడిలో తమ ప్రమేయం ఉన్నట్టు వారు అంగీకరించారని ప్రధాని కార్యాలయం ఆ ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న భద్రతా దళాలను నవాజ్ షరీఫ్ అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com