విదూడలైన 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' ఫస్ట్ లుక్

- October 02, 2016 , by Maagulf
విదూడలైన 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' ఫస్ట్ లుక్

ఒకప్పుడు విలన్లు హీరోలుగా మారారు. ఇప్పుడు హాస్యనటులు కథానాయకులుగా మారి రాణిస్తున్నారు. తనదైన టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన హాస్యనటుడు సప్తగిరి తాజాగా కథానాయకుడి అవతారం ఎత్తబోతున్నారు. అరుణ్‌ పవార్‌ దర్శకత్వంలో సప్తగిరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌'. సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్‌ పతాకంపై రవి కిరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను ఆదివారం దర్శకుడు మేర్లపాక గాంధీ విడుదల చేశారు. తమిళ చిత్రం 'తిరుడన్‌ పోలీస్‌' తనకు బాగా నచ్చిందని, ఆ మూలకథని తీసుకుని స్క్రిప్ట్‌ తానే రాసుకొన్నానని, ఈ కథకు దర్శకుడు అరుణ్‌ చక్కటి న్యాయం చేశారని సప్తగిరి అన్నారు. అలీ, పోసాని, షాయాజీషిడే, అజయ్‌ఘోష్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బుల్‌గనిన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com