తిరుపతిలో 'చంద్రన్న బీమా' పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- October 02, 2016
సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తిరుపతిలోని తారకరామ మైదానంలో 'చంద్రన్న బీమా' పథకాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే అసంఘటిత రంగ కార్మికులకు బీమా పథకం ప్రారంభించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. చంద్రన్న బీమా ద్వారా 2కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు లబ్ది పొందుతారని వెల్లడించారు. మహాత్మా గాంధీ, లాల్బహదూర్శాస్త్రి జయంతి రోజున బీమా పథకం ప్రారంభించడం తన పూర్వజన్మ సుకృతమని వ్యాఖ్యానించారు.
దేశానికి స్వాతంత్య్ర సాధించిపెట్టిన మహాత్మాగాంధీ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అనునిత్యం పేదవారి సంక్షేమం కోసమే పనిచేయాలని తన జీవితాశయంగా మార్చుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రమే తన కుటుంబమని.. ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ భరోసా కింద వృద్ధులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 పింఛన్లు ఇస్తున్నట్లు చెప్పారు.
చంద్రన్న బీమా వివరాలు:
* ప్రమాదవశాత్తూ మరణించినా, పూర్తిస్థాయి అంగవైకల్యం సంభవించినా రూ.5లక్షలు
* ఏదైనా ప్రమాదంలో పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే రూ.3,62,500
* సహజంగా మరణిస్తే రూ.30వేలు
* ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల పిల్లల్లో ఇద్దరికి రూ.1200 చొప్పున ఉపకార వేతనం
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







