చైనా భద్రతా విభాగాల్లో రోబోలు..!!
- October 02, 2016
కీలకమైన విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో అనుమానాస్పద వ్యక్తుల్ని గుర్తించి, అప్రమత్తం చేసే మేధస్సు ఉన్న పది రోబోలను చైనా ఆదివారం విధుల్లోకి ప్రవేశపెట్టింది. ముఖకవళికల సాంకేతిక పరిజ్ఞానం (ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ) ఆధారంగా రోబోలు అనుమానితులను గుర్తిస్తాయని కస్టమ్స్ అధికారి ఝావో మిన్ తెలిపారు. దక్షిణ గాంగ్డాంగ్ రాష్ట్రంలోని విమానాశ్రయంలో ఝుహాయి, ఝాంగ్షాన్ నగరాల్లోని గాంగ్బెయి, హెంగ్వి్కన్ నౌకాశ్రయాల్లో ఇవి ఆదివారం విధులు నిర్వర్తించాయి.
గ్జియోహాయ్గా నామకరణం చేసిన ఈ మరమనుషులు తమంతట తాముగా వినడం, మాట్లాడటం, కొత్తకొత్త విషయాలు నేర్చుకోవడం, చూడటం, నడవడం చేయగలవని చైనా వార్తాసంస్థ జిన్హువా తెలిపింది. వీటిలో అమర్చిన ప్రత్యేకమైన డేటాబేస్ ఆధారంగా కాంటనీస్, మాండరిన్, ఇంగ్లిష్, జాపనీస్ తదితర 28 భాషలు, యాసల్లోనూ సమాధానం ఇవ్వగలవు. రోబోలు భద్రతా విధులు నిర్వర్తిస్తుండగా డ్రోన్లు ట్రాఫిక్ను పర్యవేక్షించే బాధ్యతలు తీసుకున్నాయి. జాతీయ దినోత్సవం సందర్భంగా చైనాలో శనివారం నుంచి వారంపాటు సెలవులు ప్రకటించారు. దీంతో సరదాగా గడపడానికి లక్షలకొద్దీ జనం రోడ్డు, రైలు, ఆకాశమార్గాన ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఈ ట్రాఫిక్ని పర్యవేక్షించడానికి అక్కడి అధికారులు డ్రోన్లను మోహరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







