కాబూలీ శనగల పలావ్‌

- October 02, 2016 , by Maagulf
కాబూలీ శనగల పలావ్‌

కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం - 1కప్పు, కాబూలీ శనగలు - 100 గ్రా., జీలకర్ర - 1 టీ స్పూను, మిరియాలు - 10, లవంగాలు - 4, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, యాలకులు - 3, నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, అల్లం - అంగుళం ముక్క, పచ్చిమిర్చి - 2, నిమ్మకాయ - 1, కొత్తిమీర తరుగు - అరకప్పు.

తయారుచేసే విధానం: కాబూలీ శనగలను ఒక రాత్రంతా నానబెట్టాలి. మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులను పొడి చేసుకోవాలి. నెయ్యిలో జీలకర్ర, మసాల పొడి వేగాక, పొడుగ్గా తరిగిన అల్లం, పచ్చిమిర్చి వేసి రెండు నిమిషాల తర్వాత అరగంట నానబెట్టి (నీరు వడకట్టిన) బియ్యం, శనగలు వేసి 3 నిమిషాలు అడుగంటకుండా కలపాలి. తర్వాత 2 కప్పుల నీరు, ఉప్పు, నిమ్మరసం వేసి ఒక విజిల్‌ రాగానే మంట తీసేయాలి. రైతాతో వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com