కాబూలీ శనగల పలావ్
- October 02, 2016
కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం - 1కప్పు, కాబూలీ శనగలు - 100 గ్రా., జీలకర్ర - 1 టీ స్పూను, మిరియాలు - 10, లవంగాలు - 4, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, యాలకులు - 3, నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, అల్లం - అంగుళం ముక్క, పచ్చిమిర్చి - 2, నిమ్మకాయ - 1, కొత్తిమీర తరుగు - అరకప్పు.
తయారుచేసే విధానం: కాబూలీ శనగలను ఒక రాత్రంతా నానబెట్టాలి. మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులను పొడి చేసుకోవాలి. నెయ్యిలో జీలకర్ర, మసాల పొడి వేగాక, పొడుగ్గా తరిగిన అల్లం, పచ్చిమిర్చి వేసి రెండు నిమిషాల తర్వాత అరగంట నానబెట్టి (నీరు వడకట్టిన) బియ్యం, శనగలు వేసి 3 నిమిషాలు అడుగంటకుండా కలపాలి. తర్వాత 2 కప్పుల నీరు, ఉప్పు, నిమ్మరసం వేసి ఒక విజిల్ రాగానే మంట తీసేయాలి. రైతాతో వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









