కాబూలీ శనగల పలావ్
- October 02, 2016
కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం - 1కప్పు, కాబూలీ శనగలు - 100 గ్రా., జీలకర్ర - 1 టీ స్పూను, మిరియాలు - 10, లవంగాలు - 4, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, యాలకులు - 3, నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, అల్లం - అంగుళం ముక్క, పచ్చిమిర్చి - 2, నిమ్మకాయ - 1, కొత్తిమీర తరుగు - అరకప్పు.
తయారుచేసే విధానం: కాబూలీ శనగలను ఒక రాత్రంతా నానబెట్టాలి. మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులను పొడి చేసుకోవాలి. నెయ్యిలో జీలకర్ర, మసాల పొడి వేగాక, పొడుగ్గా తరిగిన అల్లం, పచ్చిమిర్చి వేసి రెండు నిమిషాల తర్వాత అరగంట నానబెట్టి (నీరు వడకట్టిన) బియ్యం, శనగలు వేసి 3 నిమిషాలు అడుగంటకుండా కలపాలి. తర్వాత 2 కప్పుల నీరు, ఉప్పు, నిమ్మరసం వేసి ఒక విజిల్ రాగానే మంట తీసేయాలి. రైతాతో వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







