వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన టీం ఇండియా

- October 03, 2016 , by Maagulf
వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన టీం ఇండియా

న్యూజిలాండ్ జట్టుపై సెకండ్ టెస్ట్‌లో 178 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీం ఇండియా వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించింది. కివీస్ జట్లుపై రెండో టెస్టులో మరో రోజు ఆట మిగిలి ఉండగానే సిరీస్‌ను గెలిచింది. అంతే కాదు దీంతో పాటుగా టెస్టుల్లో అగ్రస్థానానికి చేరుకుంది. 111 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నపాకిస్థాన్‌ను టీం ఇండియా కిందకు నెట్టేసింది. న్యూజిలాండ్‌పై టెస్ట్ సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకున్న తర్వాత పాకిస్థాన్ మొదటిసారిగా టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంక్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే టీం ఇండియా గనుక న్యూజిలాండ్‌తో జరగనున్న మూడో టెస్ట్ మ్యాచ్‌ను డ్రా చేసినా, గెలిచినా ఇక అగ్ర స్థానానికి తిరిగి చేరుకోవడం పాక్‌కు కష్టమే.

2017 మార్చి వరకూ టీం ఇండియాకు టెస్టులు వరుసగా ఉన్నాయి. దీంతో అగ్ర స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com