వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన టీం ఇండియా
- October 03, 2016
న్యూజిలాండ్ జట్టుపై సెకండ్ టెస్ట్లో 178 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీం ఇండియా వరల్డ్ ఛాంపియన్గా అవతరించింది. కివీస్ జట్లుపై రెండో టెస్టులో మరో రోజు ఆట మిగిలి ఉండగానే సిరీస్ను గెలిచింది. అంతే కాదు దీంతో పాటుగా టెస్టుల్లో అగ్రస్థానానికి చేరుకుంది. 111 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నపాకిస్థాన్ను టీం ఇండియా కిందకు నెట్టేసింది. న్యూజిలాండ్పై టెస్ట్ సిరీస్ను 2-2తో డ్రా చేసుకున్న తర్వాత పాకిస్థాన్ మొదటిసారిగా టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంక్కు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే టీం ఇండియా గనుక న్యూజిలాండ్తో జరగనున్న మూడో టెస్ట్ మ్యాచ్ను డ్రా చేసినా, గెలిచినా ఇక అగ్ర స్థానానికి తిరిగి చేరుకోవడం పాక్కు కష్టమే.
2017 మార్చి వరకూ టీం ఇండియాకు టెస్టులు వరుసగా ఉన్నాయి. దీంతో అగ్ర స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







