'మరో దృశ్యం' షూటింగ్‌ ప్రారంభo...

- October 03, 2016 , by Maagulf
'మరో దృశ్యం'  షూటింగ్‌ ప్రారంభo...

కట్ల రాజేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో ఆర్‌.ఎమ్‌. మూవీ మేకర్స్‌ సంస్థ 'మరో దృశ్యం' అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. గౌతమ్‌, శ్వేత జంటగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 15 నుంచి సూర్యాపేట పరిసరాల్లో చిత్రీకరణ జరుపుతామని దర్శకుడు రాజేంద్రప్రసాద్‌ చెప్పారు. నేరాలు, ఘోరాలు లేని భారతదేశం ఆవిష్కృతమవ్వాలనే కథాంశంతో సినిమా చేస్తున్నామన్నారు. 'వీరనారి చాకలి ఐలమ్మ' చిత్రాన్ని నిర్మించిన తాను ఈ చిత్రానికి సహకారం అందిస్తున్నాననీ, ఓ పాత్రను కూడా పోషిస్తున్నాననీ సోమిరెడ్డి తెలిపారు.తమకిది తొలి చిత్రమని హీరో హీరోయిన్లు తెలిపారు. షఫి, కాదంబరి కిరణ్‌కుమార్‌, అన్నపూర్ణ, కవిత, ప్రభావతి, చిట్టిబాబు, తిరుపతి ప్రకాశ, వినోద్‌, జానన్న, కృష్ణన్న, శ్రీహరి తారాగణమూన ఈ చిత్రానికి పాటలు: జయసూర్య, ఛాయాగ్రహణం: భాస్కర్ల మురళి, ఫైట్స్‌: సుబ్బు, కథ, మాటలు, స్ర్కీనప్లే, సంగీతం, కొరియోగ్రఫీ: కట్ల రాజేంద్రప్రసాద్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com