ఐసిస్పై పోరులో రష్యా మరో అడుగు ముందుకి...
- October 04, 2016
ఐసిస్పై పోరులో రష్యా మరో అడుగు ముందుకేసింది. గగనతల రక్షణకు సంబంధించిన క్షిపణి వ్యవస్థ ఎస్-300ను సిరియాలోని రేవుపట్టణం టార్టస్కు చేర్చింది. ఈ విషయాన్ని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి లొగోర్ కొనషిన్కోవ్ తెలిపారు. వైమానిక దాడులు జరగకుండా రష్యా స్థావరాల్ని రక్షించడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. ఇది ఎవరిపైకి గురిపెట్టేందుకు కాదని ఆయన చెప్పారు.పశ్చిమ ప్రాంతంలో పోరును తీవ్రతరం చేసేందుకే ఈ చర్య తీసుకున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే సోమవారం వైమానిక దాడులను సమన్వయం చేసుకునేందుకు రష్యాతో సమావేశమైంది.ఎస్ఏ-23గా సుపరిచితమైన ఎస్-300 వ్యవస్థను ఇప్పటి వరకు రష్యా బయట వినియోగించలేదు. దీనిని పూర్తిగా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించవచ్చు. దీని రాడార్లు, లాంఛర్లు, కమాండ్ వ్యవస్థను ట్రక్కులపై తరలించే వీలుంది. దీనికి ఎస్-400 వ్యవస్థను కూడా చేరిస్తే పూర్తిస్థాయి వైమానిక నిరోధక వ్యవస్థ సిద్ధమైపోతుంది. ఇప్పటికే ఈ వ్యవస్థ సమీపంలోని రష్యా వైమానిక స్థావరమైన లటాకియాలో ఉంది.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









