ఐసిస్పై పోరులో రష్యా మరో అడుగు ముందుకి...
- October 04, 2016
ఐసిస్పై పోరులో రష్యా మరో అడుగు ముందుకేసింది. గగనతల రక్షణకు సంబంధించిన క్షిపణి వ్యవస్థ ఎస్-300ను సిరియాలోని రేవుపట్టణం టార్టస్కు చేర్చింది. ఈ విషయాన్ని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి లొగోర్ కొనషిన్కోవ్ తెలిపారు. వైమానిక దాడులు జరగకుండా రష్యా స్థావరాల్ని రక్షించడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. ఇది ఎవరిపైకి గురిపెట్టేందుకు కాదని ఆయన చెప్పారు.పశ్చిమ ప్రాంతంలో పోరును తీవ్రతరం చేసేందుకే ఈ చర్య తీసుకున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే సోమవారం వైమానిక దాడులను సమన్వయం చేసుకునేందుకు రష్యాతో సమావేశమైంది.ఎస్ఏ-23గా సుపరిచితమైన ఎస్-300 వ్యవస్థను ఇప్పటి వరకు రష్యా బయట వినియోగించలేదు. దీనిని పూర్తిగా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించవచ్చు. దీని రాడార్లు, లాంఛర్లు, కమాండ్ వ్యవస్థను ట్రక్కులపై తరలించే వీలుంది. దీనికి ఎస్-400 వ్యవస్థను కూడా చేరిస్తే పూర్తిస్థాయి వైమానిక నిరోధక వ్యవస్థ సిద్ధమైపోతుంది. ఇప్పటికే ఈ వ్యవస్థ సమీపంలోని రష్యా వైమానిక స్థావరమైన లటాకియాలో ఉంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







