ఆరోగ్య శ్రీ సేవలను మళ్ళీ పునరుద్ధరించారు...

- October 04, 2016 , by Maagulf
ఆరోగ్య శ్రీ సేవలను మళ్ళీ  పునరుద్ధరించారు...

తెలంగాణాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలను చాలావరకు పునరుద్ధరించారు. మంగళ వారం పలు హాస్పిటల్స్ వీటిని తిరిగి ప్రారంభించాయి. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు ఆరోగ్య శ్రీ సేవలు అందించబోమన్న ఆసుపత్రి యాజమాన్యాలు.. సర్కార్ హెచ్చరికతో దిగివచ్చాయి.రాష్ట్రంలో 318 ఆసుపత్రులు ఈ సేవలను అందిస్తుండగా..240 హాస్పిటల్స్ లో మళ్ళీ వీటిని మొదలుపెట్టారు. కాగా 72 ఆసుపత్రులు ఇంకా సమ్మెను కొనసాగిస్తున్నాయి. బకాయి బిల్లులను ప్రభుత్వం బుధవారం నుంచి చెల్లించనుంది. మొత్తం రూ. 232 కోట్ల బకాయిల పే మెంట్ కు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com