137 నిబంధనల ఉల్లంఘనల గుర్తింపు
- October 05, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ మరియు కామర్స్ (ఎంఇసి) 137 నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి నోటీసుల్ని సెప్టెంబర్లో జారీ చేసింది. కన్స్యుమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్కి సంబంధించి ఈ నోటీసుల్ని జారీ చేసింది. కన్స్యూమర్ ప్రొటెక్షన్ చట్టం నెంబర్ 8 - 2008 ప్రకారం పేర్కొన్న నిబంధనల్ని ఉల్లంఘించినవారిపై చర్యలకు తీసుకోబడ్తాయి. గత సెప్టెంబర్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ నిబంధనల ఉల్లంఘలనలు గుర్తించారు అధికారులు. 5,00 ఖతారీ రియాల్స్ నుంచి 30,000 ఖతారీ రియాల్స్ వరకు ఆయా నిబంధనల ఉల్లంఘనల్ని బట్టి జరీమానాలు విధించబడ్డాయి. అరబిక్లో బిల్స్ ఇవ్వకపోవడం, ప్రోడక్ట్కి సంబంధించిన సమాచారాన్ని పేర్కొనకపోవడం, డిక్లరేషన్స్ మరియు స్టేట్మెంట్స్ని అరబిక్ భాషలో ప్రస్తావించకపోవడం, ఓ ప్రోడక్ట్ని ప్రదర్శనకు ఉంచడం లేదా ప్రచారం చేసిన సందర్భంలో తప్పుడు సమాచారాన్ని ఉపయోగించడం, నిర్ధారిత ధర కంటే ఎక్కువ ధరకు అమ్మడం, గడువు తీరిన పదార్థాల్ని అమ్మడం లేదా ప్రదర్శనకు ఉంచడం వంటివి ఈ నిబంధనల ఉల్లంఘనల్లో గుర్తించబడ్డాయి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







