జెరూసలేంలో 13మంది మహిళా కార్యకర్తల అరెస్టు
- October 08, 2016
దిగ్బంధనానికి గురైన గాజా ప్రాంతానికి సాయం తీసుకెళుతున్న ఓడను అంతర్జాతీయ జలాల్లో హైజాక్ చేసిన ఇజ్రాయిలీ నావికాదళం అందులోని 13మంది మహిళా శాంతి కార్యకర్తలను అరెస్టు చేసింది. గాజా నుండి 40మైళ్ళ దూరంలోని అషదద్ పోర్టులో వున్న డచ్ ఓడను ఇజ్రాయిల్ బలగాలు బలవంతంగా స్వాధీనం చేసుకున్నాయి. అందులో వున మహిళలను విచారణ నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు సైన్యం తెలిపింది. 11మంది ప్రయాణికులను కూడా దాదాపు 96గంటల పాటు నిర్బంధించామని ఇజ్రాయిల్ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి సాబిన్ హద్దద్ తెలిపారు. ఈలోగా వారిని ఇజ్రాయిల్ వీడి వెళ్ళేందుకు అవకాశం ఇచ్చామని, కానీ వారు తిరస్కరించారని చెప్పారు.ఇద్దరు మహిళా జర్నలిస్టులు మాత్రం వెంటనే వెళ్ళిపోయారని చెప్పారు. ఓడలోని ప్రయాణికులను, సిబ్బందిని తక్షణమే విడిపించాలంటూ డెమోక్రటిక్, గ్రీన్స్ పార్లమెంటరీ గ్రూపులు ఇయుకి ఒక లేఖ రాశాయి. ఇజ్రాయిల్ ప్రభుత్వం ఏకపక్షంగా, అక్రమంగా వ్యవహరించిందని వారు విమర్శించారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







