ఐఎస్ఐఎస్ అనుమానితులను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
- October 08, 2016
కిరాతక ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్తో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తమిళనాడులోని కోయంబత్తూరు నగరానికి చెందిన నలుగురిని ప్రశ్నించింది. కేరళలోని కన్నూరుకు చెందిన అబూ బషీర్ను ఎన్ఐఏ శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేసింది. ఐసిస్ భావజాలంతో ప్రేరేపితమై ఉగ్రదాడులు చేయాలనుకున్న మరో ఐదుగురిని అతడితో పాటు అదుపులోకి తీసుకున్నారు. బషీర్ ఫేస్బుక్, టెలిఫోన్ జాబితాలో ఉన్న కోయంబత్తూరు ఉక్కడంకు చెందిన 11 మందిని పోలీసులు ప్రశ్నించారు. వారి నుంచి లాప్టాప్లు, మొబైళ్లు, కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఐసిస్తో సంబంధాలున్నాయన్న నలుగురిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని విచారించింది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







