ఐఎస్ఐఎస్ అనుమానితులను అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ

- October 08, 2016 , by Maagulf
ఐఎస్ఐఎస్ అనుమానితులను అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ

కిరాతక ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తమిళనాడులోని కోయంబత్తూరు నగరానికి చెందిన నలుగురిని ప్రశ్నించింది. కేరళలోని కన్నూరుకు చెందిన అబూ బషీర్‌ను ఎన్‌ఐఏ శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేసింది. ఐసిస్‌ భావజాలంతో ప్రేరేపితమై ఉగ్రదాడులు చేయాలనుకున్న మరో ఐదుగురిని అతడితో పాటు అదుపులోకి తీసుకున్నారు. బషీర్‌ ఫేస్‌బుక్‌, టెలిఫోన్‌ జాబితాలో ఉన్న కోయంబత్తూరు ఉక్కడంకు చెందిన 11 మందిని పోలీసులు ప్రశ్నించారు. వారి నుంచి లాప్‌టాప్‌లు, మొబైళ్లు, కొన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఐసిస్‌తో సంబంధాలున్నాయన్న నలుగురిని ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకొని విచారించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com