పాక్లో ఆత్మాహుతి దాడి పంజాబ్ హోంమంత్రి సహా 9 మంది మృతి
- August 16, 2015
ఇస్లామాబాద్, పాకిస్థాన్లో జరిగిన ఆత్మహుతి దాడిలో పంజాబ్ హోంమంత్రి సుజా ఖాన్జాదా సహా 9 మంది చనిపోయారు. అటోక్ జిల్లా షాదిఖియి గ్రామంలో సుజా నివాసంలో ఈ దాడి జరిగింది. ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చివేసుకోవడంతో ఈ ఘటన జరిగింది. పేలుడులో పలువురు గాయపడ్డారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. పేలుడులో డిఎస్పీ షౌకత్ షా కూడా చనిపోయారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఖాన్జాదా నివాసంలో సమావేశం జరుగుతుండగా ఈ ఆత్మాహుతి దాడి జరగడంతో మృతుల సంఖ్య పెరిగింది. పాముకు పాలు పోసి పెంచినట్లు భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచిన పాకిస్థాన్ చివరకు పాము కాటుకే బలౌతోంది. అయినా పాక్ పాలకుల్లో మార్పు మాత్రం రావడం లేదు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







