పాక్లో ఆత్మాహుతి దాడి పంజాబ్ హోంమంత్రి సహా 9 మంది మృతి
- August 16, 2015
ఇస్లామాబాద్, పాకిస్థాన్లో జరిగిన ఆత్మహుతి దాడిలో పంజాబ్ హోంమంత్రి సుజా ఖాన్జాదా సహా 9 మంది చనిపోయారు. అటోక్ జిల్లా షాదిఖియి గ్రామంలో సుజా నివాసంలో ఈ దాడి జరిగింది. ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చివేసుకోవడంతో ఈ ఘటన జరిగింది. పేలుడులో పలువురు గాయపడ్డారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. పేలుడులో డిఎస్పీ షౌకత్ షా కూడా చనిపోయారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఖాన్జాదా నివాసంలో సమావేశం జరుగుతుండగా ఈ ఆత్మాహుతి దాడి జరగడంతో మృతుల సంఖ్య పెరిగింది. పాముకు పాలు పోసి పెంచినట్లు భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచిన పాకిస్థాన్ చివరకు పాము కాటుకే బలౌతోంది. అయినా పాక్ పాలకుల్లో మార్పు మాత్రం రావడం లేదు.
తాజా వార్తలు
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం









