పాక్లో ఆత్మాహుతి దాడి పంజాబ్ హోంమంత్రి సహా 9 మంది మృతి
- August 16, 2015
ఇస్లామాబాద్, పాకిస్థాన్లో జరిగిన ఆత్మహుతి దాడిలో పంజాబ్ హోంమంత్రి సుజా ఖాన్జాదా సహా 9 మంది చనిపోయారు. అటోక్ జిల్లా షాదిఖియి గ్రామంలో సుజా నివాసంలో ఈ దాడి జరిగింది. ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చివేసుకోవడంతో ఈ ఘటన జరిగింది. పేలుడులో పలువురు గాయపడ్డారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. పేలుడులో డిఎస్పీ షౌకత్ షా కూడా చనిపోయారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఖాన్జాదా నివాసంలో సమావేశం జరుగుతుండగా ఈ ఆత్మాహుతి దాడి జరగడంతో మృతుల సంఖ్య పెరిగింది. పాముకు పాలు పోసి పెంచినట్లు భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచిన పాకిస్థాన్ చివరకు పాము కాటుకే బలౌతోంది. అయినా పాక్ పాలకుల్లో మార్పు మాత్రం రావడం లేదు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









