అరబ్ కంట్రీ నాకు "మినీ ఇండియా"

- August 16, 2015 , by Maagulf
అరబ్ కంట్రీ నాకు

ప్రధాని నరేంద్రమోడీ పర్యటనలో భాగంగా ఇవాళ యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) కి చేరుకున్నారు. యూఏఈలో ప్రధాని పర్యటన రెండు రోజులపాటు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా యూఏఈ రాజు షేక్ మహ్మద్‌బిన్ జయీద్‌తో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు.

యూఏఈ వెళ్లిన సందర్భంగా షార్జాకు చెందిన ఖాలిజ్ అనే పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, అరబ్ దేశాలు భారత్ కు ఎప్పుడూ ముఖ్యమైనవేనని అన్నారు. చాలా సంవత్సరాల తరువాత ఒక భారత ప్రధాని అరబ్ దేశాల పర్యటనకు వెళ్తున్నారని ఆయన చెప్పారు. అరబ్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల్లో భారత్ ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు. గల్ఫ్ దేశాల్లో 26 లక్షల మంది భారతీయులు ఉంటున్నారని, అందుకే గల్ఫ్ దేశం తనకు మినీ ఇండియాలా అనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత్ కు రక్షణ, ఆర్థికాభివృద్ధిలో గల్ఫ్ పాత్ర మరువలేనిదని ఆయన అభిప్రాయపడ్డారు.

 

--యం.వాసుదేవరావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com