అరబ్ కంట్రీ నాకు "మినీ ఇండియా"
- August 16, 2015
ప్రధాని నరేంద్రమోడీ పర్యటనలో భాగంగా ఇవాళ యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) కి చేరుకున్నారు. యూఏఈలో ప్రధాని పర్యటన రెండు రోజులపాటు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా యూఏఈ రాజు షేక్ మహ్మద్బిన్ జయీద్తో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు.
యూఏఈ వెళ్లిన సందర్భంగా షార్జాకు చెందిన ఖాలిజ్ అనే పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, అరబ్ దేశాలు భారత్ కు ఎప్పుడూ ముఖ్యమైనవేనని అన్నారు. చాలా సంవత్సరాల తరువాత ఒక భారత ప్రధాని అరబ్ దేశాల పర్యటనకు వెళ్తున్నారని ఆయన చెప్పారు. అరబ్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల్లో భారత్ ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు. గల్ఫ్ దేశాల్లో 26 లక్షల మంది భారతీయులు ఉంటున్నారని, అందుకే గల్ఫ్ దేశం తనకు మినీ ఇండియాలా అనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత్ కు రక్షణ, ఆర్థికాభివృద్ధిలో గల్ఫ్ పాత్ర మరువలేనిదని ఆయన అభిప్రాయపడ్డారు.
--యం.వాసుదేవరావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









