దసరా మరియు బతుకమ్మ ఉత్సవాలు - మస్కట్
- October 09, 2016

మధ్యప్రాత్య దేశమైన ఒమాన్ దేశ రాజధాని మస్కట్ నగరములో వినూత్నముగా ఎక్కడా కనిపించని విధంగా మొత్తం తెలుగు ప్రజలందరూ సుమారు 1500 పైచిలుకు ఒకదగ్గర సమావేశమై (RUWI – Al MASHA HALL) ఆటపాటలతో భక్తిశ్రద్ధలతో దసరా మరియు బతుకమ్మ ఉత్సవాలను రక్తికట్టించారు. "తెలుగు కమ్యూనిటీ (ఒమాన్)" మరియు "చిరు మెగా యూత్ ఫోర్స్" ఆధ్వర్యంలో కనులవిందుగా మొత్తం తెలుగు ఆడపడుచులు ఆడిపాడి మేమంతా ఒక్కటే 'తెలుగు జాతి - తెలుగు ప్రజలము' అని చాటి చెప్పారు. ఈ కార్యక్రమానికి మీడియా సోదరులు చేసిన సహాయానికి 'చిరు మెగా యూత్ ఫోర్స్' వ్యవస్థాపక అధ్యక్షుడు రామదాసు.చందక ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా సుఖసంతోషములతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాదు నుంచి వర్ధమాన సినీ గాయని "శివప్రియ" ప్రత్యేక ఆకర్షణతో ఆట-పాట చేయించారు. మరీ ముఖ్యంగా మస్కట్ లో ఉన్న రాయబారి కార్యాలయము నుంచి Acting Ambassador శ్రీమతి నీలు వోరా హాజరయ్యారు. ఆమె కూడా తెలుగింటి ఆడపడుచులతో ఆడిపాడారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







